'ధృవ' ఆడియో ఫంక్షన్ని ఘనంగా నిర్వహించాలని భావించారు తొలుత. కానీ ఇప్పుడు ఆ వేడుక రద్దైయిందని టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా భారీ ఈవెంట్గా ఈ ఆడియో ఫంక్షన్ని నిర్వహించాలనుకున్న చిత్ర యూనిట్ సడెన్గా ఈ న్యూస్ బయటపెట్టడం ఆశ్చర్యకరమైన విషయమే. తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి 'కాటమరాయుడు' సినిమా సెట్లో కలుసుకున్నారు. ఈ కలయికలో 'ధృవ' ఆడియో ఫంక్షన్ నిమిత్తం డిస్కర్షన్ వచ్చిందట. ఈ ఈవెంట్ని చాలా సింపుల్గా నిర్వహించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆడియో ఫంక్షన్ జరగకపోతే మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారు. మరి ఎందుకు ఈ ఫంక్షన్ జరపడం లేదో ఎవరికీ తెలియడం లేదు. ఈ నెల 9న ఈ సినిమా ఆడియోని విడుదల చేయనున్నారు. డిశంబరు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత ఎక్కువ ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రకుల్ పాత్ర ఈ సినిమాలో చాలా కొత్తగా మెచ్యూర్డ్గా ఉండబోతోందట. మాతృకతో పోల్చితే తెలుగు వెర్షన్లో హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందట. తెలుగు వెర్షన్లో అదిరిపోయే డాన్సులతో రొమాంటిక్ సాంగ్స్ కూడా ప్లాన్ చేశారట. సీనియర్ నటుడు, 'రోజా' ఫేం అరవింద్ స్వామి ప్రతినాయకుని పాత్రలో కనిపిస్తున్నారు ఈ సినిమాలో.
|