'ఒక లైలా కోసం', 'ముకుంద' చిత్రాల ఫేం అందాల భామ పూజా హెగ్దే, 'మొహంజదారో' సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తొలి సినిమానే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో బాలీవుడ్లో నటిస్తుండడం వల్ల ఆ సినిమా విడుదలయ్యాక పూజా హెగ్దే మళ్ళీ తెలుగు తెరపైకి చూడకపోవచ్చునని అందరూ అనుకున్నారు. అయితే 'మొహంజదారో' సినిమా పూజా హెగ్దేకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వలేదు. దాంతో ఆమె తనకు హీరోయిన్గా మంచి సక్సెస్లు అందించిన తెలుగు తెరపైకి తిరిగి దృష్టి సారించింది.
అలా తెలుగులో పూజా హెగ్దే పునరాగమనానికి లైన్ క్లియర్ అయ్యింది. రీ ఎంట్రీ ఇస్తూనే అల్లు అర్జున్ సరసన 'డిజె - దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసిందీ భామ. ఆ వెంటనే పూజా హెగ్దేకి ఇంకో పవర్ఫుల్ ఛాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో పవన్కళ్యాణ్ నటించనున్న సినిమాలో పూజా హెగ్దేని హీరోయిన్గా ఎంపిక చేశారట. ఈ సినిమా కోసం ఇప్పటికే 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్ని ఓ హీరోయిన్గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్గా పూజా హెగ్దేకి ఛాన్స్ దక్కినట్లు తెలియవస్తోంది. అందానికి అందం, దానికి తగ్గ నటనతో పూజా హెగ్దేకి అనతికాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలున్నాయి. ఆల్ ది బెస్ట్ టు పూజా హెగ్దే.
|