'ధృవ' సినిమా విడుదలకి సిద్ధమైంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యింది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు తెలంగాణా మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.ఈ వేడుకని హైద్రాబాద్లోని యూసఫ్గుడ పోలీస్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆడియో ఫంక్షన్లు నిర్వహించడం రొటీన్. కానీ దానికి భిన్నంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని భారీ స్థాయిలో నిర్వహించనుండడం వెరైటీనే. ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఈ ఫంక్షన్కి పోలీస్ గ్రౌండ్స్ని వేదికగా చేసుకున్నారు కాబోలు. డిశంబరు 4వ తేదీన జరుగు ఈ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అయితే చిరంజీవి 'ఖైదీ నెం 150' సినిమాతోనూ, పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. అభిమానుల కోసం ఈ వేడుకకు హాజరయ్యేందుకు తమ తమ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారమ్. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చరణ్కి చాలా ప్రతిష్ఠాత్మకం. అంతేకాక అల్లు అరవింద్, చరణ్తో గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'మగధీర' తర్వాత తెరకెక్కిస్తోన్న భారీ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు చరణ్. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న సినిమా ఇది. మైండ్ గేమ్ తరహాలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. డిశంబరు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగిందని సమాచారమ్. చరణ్ సినిమాల్లోనే ఇది ఓ రికార్డ్గా చెప్పుకుంటున్నారు.
|