నేచరుల్ బ్యూటీగా అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఈ బ్యూటీ 'అఆ' సినిమాతో పాపులర్ అయ్యింది తెలుగులో. 'అఆ' తర్వాత అనుపమ 'ప్రేమమ్' చిత్రంలోనూ నటించింది. ఈ రెండు సినిమాలూ ఆమెకు మంచి విజయాన్నిచ్చాయి. తాజాగా ఈ బ్యూటీకి ఎన్టీయార్ సినిమాలో అవకాశం దక్కిందని సమాచారమ్. కళ్యాణ్రామ్ నిర్మాణంలో దర్శకుడు బాబి రూపొందించనున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ని ఓ హీరోయిన్గా ఎంపిక చేశారట. ఎన్టీయార్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తాడని గాసిప్స్ వినవస్తున్నాయి. అంటే సినిమాకి ముగ్గురు హీరోయిన్లు ఖాయమన్నమాట. ఆ ముగ్గురు హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ చోటు దక్కించుకునే గాసిప్ ఇప్పుడు బయటకు వచ్చింది.
అయితే దీన్నింకా అనుపమ ధృవీకరించలేదు. ఇంత వరకూ చిన్న హీరోలతోనే నటించిన ఈ ముద్దుగుమ్మకి ఒకేసారి నందమూరి నటసింహం ఎన్టీఆర్తో ఛాన్స్ వచ్చిందంటే తెలుగులో అమ్మడి కెరీర్ టర్న్ అయినట్లే. అంతేకాదు ఎన్టీఆర్, అనుపమా పరమేశ్వరన్ పెయిర్ కూడా స్క్రీన్పై చూడచక్కగా ఉంటుందంటూ ఫిల్మ్నగర్లో అప్పుడే పోజిటివ్ టాక్స్ గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. సినిమాపై అధికారిక ప్రకటన త్వరలో వెల్లడవుతుందట. దాంట్లో అన్ని విషయాల్నీ చిత్ర యూనిట్ ధృవీకరించనుంది. 'అదుర్స్' తరహాలో మాంఛి కామెడీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ని బాబీ, ఎన్టీయార్తో రూపొందిస్తున్నాడని తెలియవస్తోంది.
|