మెగాస్టార్ రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలకి సర్వం సిద్దమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముంబయ్లో ఈ సినిమాను మరాఠా ధియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఈ ధియేటర్కి ఓ ప్రత్యేకత ఉంది. షారూఖ్ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్ వాలే దుల్హనియే లేజాయేంగే' సినిమా ఈ ధియేటర్లో 1000 వారాలు ప్రదర్శితమయ్యింది. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన ధియేటర్లో ఈ సినిమాను ప్రదర్శిస్తుండడం విశేషం. మరో పక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గుంటూరులోని 'హాయ్లాండ్'లో ఈ వేడుక నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్కి వేలాదిగా అభిమానులు తరలి వచ్చే అవకాశాలున్నందున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ ఫంక్షన్కి హాజరవుతారని సమాచారమ్. దర్శకరత్న దాసరి నారాయణరావు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. వినాయక్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకి రామ్చరణ్ నిర్మాత. చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఐటమ్ సాంగ్ 'రత్తాలు'లో లక్ష్మీరాయ్ అందాలు హైలైట్ కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో విడుదలైన ఈ సినిమా పాటలకు రెస్పాన్స్ అదిరిపోతోంది. అందులో తాజాగా విడుదలైన రైతు పాట అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. మాస్ జోష్ ఉన్న పాటలు ఒక ఎత్తు, ఆలోచింపజేసేలా ఉన్న ఈ రైతు పాట ఇంకో ఎత్తు. సినిమాకి మూల కథే రైతు సమస్యల అంశం. అందుకే ఈ పాట కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారమ్.
|