కావలిసిన పదార్ధాలు: లెగ్ పీసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర, పూదీన, బిరియానీ మసాలా దినుసులు, కారం, ఉప్పు, పసుపు, నిమ్మకాయ
తయారుచేసేవిదానం: ముందుగా కట్టెల పొయ్యి మీద గిన్నె వుంచి వేడెక్కాక నూనె వేసి బిరియానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పూదీన, కరివేపాకు , అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. తరువాత లెగ్ పీసులను ఒకదాని వెనుక ఒకటి వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోయాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి కడిగిన బియ్యాన్ని ఇందులో వేయాలి. చివరగా ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసి అరటాకులను గిన్నెపై మొత్తం మూతలా పేర్చాలి. అలా 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతే అతి సులువుగా లెగ్ పీస్ బిరియానీ రెడీ..
|