సినీ రంగానికిచ్చే అద్భుత పురస్కారం నంది అవార్డులు వచ్చేశాయి. 2012, 2013 సంవత్సరాలకు గానూ ఉత్తమ చిత్రాలకు నంది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకి ఉత్తమ చిత్రాలుగా 'ఈగ', మిర్చి' సినిమాలు ఎంపికయ్యాయి. రాజమౌళి చేసిన ప్రయోగం 'ఈగ' సెన్సేషనల్ అయ్యింది అప్పట్లో. అందుకుగానూ 2012 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ఈ సినిమా ఎంపికైంది. ఇక ప్రబాస్ని స్టార్ హీరోగా నిలబెట్టిన 'మిర్చి' సినిమా 2013లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ఉత్తమ కధానాయకుడిగా 2012లో నేచురల్ స్టార్ నాని ఎన్నికయ్యాడు.'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రానికి గానూ ఈ అవార్డు దక్కింది నానికి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత ఉత్తమ నటిగా ఎంపికైంది ఆ ఏడాది. ఇక 2013లో ఉత్తమ కథా నాయకుడు ప్రబాస్ ఎంపిక కాగా, ఉత్తమ నటిగా అంజలి ఎంపికైంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి. అలాగే ఈ ఏడాది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'అత్తారింటికి దారేది' సినిమా ఎంపికైంది. 'ఇష్క్' చిత్రంలో అజయ్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్ర అది. అందుకే 2012 ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెలచుకున్నాడు అజయ్. ఈ సారి నంది అవార్డులు స్టార్డమ్తో సంబంధం లేకుండా అన్ని వర్గాల నటులకి దక్కడం అభినందనీయం.
|