మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మిస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొంత గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. కొంచెం యాక్షన్, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్, మరికాస్త ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవన్నీ జోడించి 'మిస్టర్' సినిమాని రూపొందించినట్లుగా ట్రైలర్ని చూస్తే అర్థమౌతుంది. అలా ట్రైలర్ని తీర్చిదిద్దడంతోనే 'మిస్టర్' టీమ్ సగం విజయం సాధించేసిందని సినీ వర్గాలంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకిప్పుడు మినమమ్ గ్యారంటీ ఉంటోంది.
అలాగే ఫ్యామిలీ వాల్యూస్ని అందంగా చూపిస్తే ఆ సినిమా హిట్టే. వీటన్నిటికీ అందమైన లొకేషన్లు తోడైతే సినిమా ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుందనడం నిస్సందేహం. 'ఆగడు', 'బ్రూస్లీ' సినిమాల తర్వాత శ్రీనువైట్ల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే 'లోఫర్' తర్వాత మెగా ప్రిన్స్ కూడా ఆడియన్స్ పల్స్ తెలుసుకున్నట్టున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న 'మిస్టర్'పై ట్రైలర్ తర్వాత అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మేచో లుక్తో వరుణ్ తేజ్, గ్లామరస్ బ్యూటీస్ లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పవచ్చు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'మిస్టర్' చాలా కాన్ఫిడెంట్గానే కనిపిస్తున్నాడు. ఈ కాన్ఫిడెన్స్తోనే ప్రమోషన్ ఇంకా బాగా చేయబోతోందట చిత్ర యూనిట్.
|