పవన్ ఇటీవలే 'కాటమరాయుడు' సినిమాతో మన ముందుకొచ్చాడు. బాక్సీఫీసుని షేక్ చేసేస్తోంది ఈ సినిమా వసూల్ల విషయంలో. ఇదిలా ఉండగా, పవన్ కొత్త సినిమా కూడా ప్రారంభమయ్యింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలి షెడ్యూల్లో కాఫీ షాప్లో సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమాలో ఇద్దరు భామలు నటిస్తున్నారు. ఇటీవలే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో ఎట్రాక్ట్ చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ఒక భామ కాగా, లక్కీ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్. వీరిద్దరిలో అనూ ఇమ్మాన్యుయేల్ ముందుగా సెట్స్లోకి అడుగుపెట్టింది. పవన్కళ్యాణ్తోపాటు ఈ ముద్దుగుమ్మపై సీన్స్ చిత్రీకరణ జరిగింది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఎంటర్ అయ్యింది. పవన్తో నటించడం చాలా చాలా అదృష్టమని ఇద్దరు హీరోయిన్లు అంటున్నారు.
ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగు పరిశ్రమకి వచ్చి ఎంతో కాలం కాలేదు. కానీ పవర్ స్టార్తో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. మరి లక్కీ బ్యూటీసే కదా. 'జల్సా',' అత్తారింటికి దారేది' తర్వాత పవన్కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే యోచనలో పవన్ - త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. విజయదశమి కానుకగా ప్రేక్షుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
|