చిరంజీవి చేయబోయే 151 వ చిత్రం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. ఇందులో ఏమాత్రం డౌటే లేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్లో తెరకెక్కుతోన్న రెండో చిత్ర మిది. మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. మరుగున పడిపోయిన ఆయన జీవిత గాధలో నటించాలని చిరు ఎప్పటి నుండో అనుకుంటున్నారట. ఆ కల ఇన్నాళ్లకి నెరవేరబోతోంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కేవలం తెలుగు చిత్రంగానే కాకుండా, ఇండియన్ మూవీగా తెరకెక్కించాలనుకుంటున్నారట. చిరంజీవి అత్యంత ప్రాధాన్యతనిచ్చే చిత్రంగా భావించి ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే చిరు కేవలం నటుడే కాదు, పొలిటికల్గా కూడా చాలా ఫాలోయింగ్ ఉన్న వారు. అందులోనూ ఈ చిత్రం పొలిటికల్గా కూడా చిరుకి మైలేజ్ ఇచ్చే చిత్రంగా భావిస్తున్నారు సినీ ప్రముఖులు. అందుకే ఈ సినిమాకి యూనివర్సల్ అప్పీల్ని ఇస్తున్నారు. దాదాపు 150 కోట్లు బడ్జెట్తో అత్యంత కాస్ట్లీ సినిమాగా ఈ సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. కానీ సెట్స్పైకి వెళ్లేసరికి ఈ బడ్జెట్ మరింత కాస్ట్లీ కానుందనీ సమాచారమ్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా ప్రస్తుతం బిజీగా ఉంది. ఆగష్టులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
|