తెలుగు సినీ గాయకుల్లో చాలామందికి తెలుగే తెలియదు. సంగీత పరిజ్ఞానం ఉన్నవారిని వేళ్ళ మీద లెక్క పెట్టేయొచ్చు. తెలుగు సినిమా పాటలో తెలుగు చచ్చిపోతోందని పలు సందర్భాల్లో ప్రముఖ రచయితలు, గాయనీ గాయకులు, సినీ సంగీతాభిమానులూ ఆవేదన చెందుతుంటారు. అలాంటివారికి ఓ తియ్యని కబురు ఇది.
‘గలగల పారుతున్న గోదారిలా..’ అనే పాటతో పాపులర్ అయిన టాలీవుడ్ యంగ్ సింగర్ నిహాల్, కంచి పీఠం ఆస్థాన గాయకుడిగా ఎంపికయ్యాడన్నదే ఆ వార్త. శాస్త్రీయ సంగీతం మీద మంచి అవగాహన వున్న గాయకుడు నిహాల్. తెలుగు సినిమా గాయకుడిగా ఎప్పుడూ శాస్త్రీయ సంగీతంపై తనకున్న పట్టుని ప్రదర్శించే అవకాశం అతనికి రాలేదుగానీ, కంచి పీఠం అతన్ని ఎంపిక చేసిందనడం తెలుగువారంతా ఆనందించాల్సిన విషయం.
ఓ తెలుగు సినీ గాయకుడికి అరుదైన అవకాశమే ఇది. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని అంటున్నాడు సింగర్ నిహాల్.
|