సినిమా సెలబ్రిటీలకు ప్రైవసీ దొరకడం చాలా కష్టం. వారికి ఉన్న పాపులారిటీ కారణంగా, ఎక్కడికి వెళ్ళినా వారి చుట్టూ అభిమానులు చేరిపోతారు. తద్వారా వారికి ప్రైవసీ లేకుండా పోతుంది. అందుకే, తామెవరో ఎవరికీ తెలియని చోట్లకే సెలబ్రిటీలు వెళ్తుంటారు ప్రైవసీ కోసం.
అలా సినీ సెలబ్రిటీలకు ‘రుసి అండ్ అడోని’ అనే ఓ రెస్టారెంట్ ‘రహస్య ప్రదేశం’గా మారింది. హైద్రాబాద్లోని రోడ్ నెంబర్ 10 లో ఈ రెస్టారెంట్ వుంది. ఇదేమీ హైలీ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ కాదుగానీ, ఎక్కువగా నార్త్ ఇండియన్స్ మాత్రమే ఈ రెస్టారెంట్ వైపు వెళ్తుంటారు. నార్త్ ఇండియన్స్ కి మన సెలబ్రిటీలు తెలిసేది తక్కువ కదా.
రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా ఇదే రెస్టారెంట్కి వెళ్ళేవాడు. కానీ, ‘రాన్జానా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితుడైపోయిన ధనుష్కి, ఈ రెస్టారెంట్లోనూ ఇప్పుడు ప్రైవసీ దక్కడంలేదు. టాలీవుడ్ ప్రముఖులు శిరీష్ వంటివారు మాత్రం ఈ రెస్టారెంట్ కి అప్పుడప్పుడూ వెళ్తుంటారట ప్రైవసీ కోసం. అలా ఈ రెస్టారెంట్ సెలబ్రిటీలకు రహస్య ప్రదేశంగా మారింది.
|