మహేష్బాబు అభిమానులకు గుడ్ న్యూస్. అదేంటంటే, 'స్పైడర్' సినిమా నిర్మాణంలో ఉండగానే, 'భరత్ అను నేను' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు మహేష్. నిజానికి 'స్పైడర్' ఇప్పటికే విడుదలైపోయి ఉండాల్సింది. కొన్ని కారణాలతో సినిమా విడుదల ఆలస్యమయ్యింది. ఈలోగా మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమాకి కమిట్ అయిపోయాడు. ఓ వైపున 'స్పైడర్', ఇంకో వైపున 'భరత్ అను నేను' సినిమాలతో మహేష్ బిజీగా ఉన్నాడంటే అది అభిమానులకి అమితానందాన్నివ్వకుండా ఉంటుందా? 'స్పైడర్' సినిమా సెప్టెంబర్లో విడుదల కానుంది. 'దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని ఇప్పటికే మహేష్, 'స్పైడర్' సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. సీక్రెట్ ఏజెంట్గా 'స్పైడర్' సినిమాలో మహేష్ కనిపించనుండగా, 'భరత్ అను నేను' సినిమా కోసం మహేష్ పొలిటికల్ లీడర్గా మారుతున్నాడు. 'స్పైడర్'లో మహేష్ సరసన లక్కీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
'భరత్ అను నేను' సినిమా కోసం బాలీవుడ్ నుంచి అందాల భామ కియారా అలియా అద్వానీని ఇంపోర్ట్ చేస్తుండడం గమనించదగ్గది. సామాజిక బాధ్యతతో విలక్షణ చిత్రాలు రూపొందించడంలో ఎ.ఆర్. మురుగదాస్ దిట్ట. ఆయనతో మహేష్కి 'స్పైడర్' తొలి సినిమా కాగా, కొరటాల శివతో ఇంతకు ముందే 'శ్రీమంతుడు' సినిమాలో నటించిన మహేష్, ఇప్పుడు 'భరత్ అను నేను' చేస్తున్నాడు. 'భరత్ అను నేను' టైటిల్ ఇంకా అధికారం కానప్పటికీ, ఇదే ఈ సినిమా టైటిల్ అవబోతోందని సమాచారమ్.
|