డిసెంబర్ 22న అఖిల్ కొత్త సినిమా విడుదల కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాలు నడుమ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు విక్రమ్. కాగా, అఖిల్ తొలి సినిమా నిరాశ పడడంతో ఈ సారి రాబోయే సినిమా విషయంలో పక్కా ప్లానింగ్తో ఉన్నారు నాగార్జున. డిసెంబర్ నాగార్జునకి బాగా సెంటిమెంట్. ఆ నెలలో నాగ్ సినిమాలు చాలా విజయవంతమైనవి ఉన్నాయి. అందుకే ఎక్కువగా నాగ్ తన సినిమాల్ని డిసెంబర్కి వచ్చేలా చూసుకుంటాడు.
తొలి సినిమా 'అఖిల్'తో అక్కినేని అఖిల్ కంటే నాగార్జునే ఎక్కువ నిరాశ చెందాడు. అందుకే అఖిల్ని హీరోగా లాంఛ్ చేసిన 'అఖిల్' సినిమాని మర్చిపోయి, రీ-లాంఛ్ మూవీగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని అభివర్ణిస్తున్నాడు నాగార్జున. తొలిసారిగా హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్ట్ సైట్స్లో అఖిల్ మూవీ షూటింగ్ జరగడం ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి. ఆ స్పాట్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ని చిత్రీకరించారు చిత్ర యూనిట్.
మెట్రో రైల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరిగింది. నాగార్జున ఈ సినిమాని తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇంకో వైపున నాగార్జున నటించిన 'రాజుగారిగది-2' విడదులకు సిద్ధమవుతోంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. తొలి సారిగా హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున. సీరత్ కపూర్ నాగ్కి జంటగా నటిస్తోంది ఈ సినిమాలో. సమంత గెస్ట్ రోల్లో నటిస్తోంది.
|