హీరోగా యంగ్టైగర్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ మూవీ 'జై లవకుశ'లో విలన్గానూ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ చూసే అవకాశం దక్కుతోంది. పర్ఫామెన్స్ పరంగా, డిఫరెంట్ షేడ్స్ పరంగా ఎన్టీఆర్కి 'జై లవకుశ' ఓ మంచి సినిమా అవుతుందంటున్నారు. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదనీ చెబుతున్నారు. ఇకపై రావడం కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే 'జై లవకుశ'లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాల్లో ఒక క్యారెక్టర్కి ఎక్కువ వెయిట్ ఇచ్చి, మిగతా క్యారెక్టర్స్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదంట. మూడు పాత్రలూ, దేనికదే ప్రత్యేకమైనవిగా ఉంటాయట.
మూడు పాత్రలకూ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉండబోతోందట. ఆ రకంగా డైరెక్టర్ ఈ మూడు పాత్రల్నీ డిజైన్ చేశాడట. ఇది చాలా కష్టమైన పనే. జై, లవ, కుశ ఈ మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్లుక్స్, టీజర్స్ ఇప్పటికే వచ్చేశాయి. ఇంకా ట్రైలర్స్ రానే లేదు. టీజర్స్తోనే ప్రభంజనం సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్. ఏదేమైనా హీరోగా ఎన్టీఆర్కీ, నిర్మాతగా కళ్యాణ్రామ్కీ, డైరెక్టర్గా బాబీకీ ఈ సినిమా కెరీర్ బెస్ట్ మూవీ కానుందని భావిస్తున్నారు. మరో పక్క ఈ నెల 3వ తేదీన ఆడియో ఫంక్షన్ని హైద్రాబాద్లో గ్రాండ్గా చేయాలనుకున్నారు. కానీ అభిమానుల భద్రత నిమిత్తం ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు భారీ వర్షాలు, గణేష్ నిమజ్జనం తదితర కారణాల వల్ల ఈ ప్రోగ్రాంని విరమించుకుంది చిత్ర యూనిట్. కానీ 3వ తేదీన డైరెక్ట్గా ఆడియోని మార్కెట్లోకి రిలీజ్ చేసేసి, 10వ తేదీన ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారనీ అధికారికంగా నిర్మాత కళ్యాణ్రామ్ అభిమానులకు తెలిపారు.
|