విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా సంచలనాత్మక విజయాన్ని అందుకుంది అప్పట్లో. చాలా కాలం తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రానుందిప్పుడు. శంకర్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో శంకర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతోంది. అప్పటి 'భారతీయుడు' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా కమల్ కెరీర్లోని టాప్ సక్సెస్ఫుల్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. మనీషా కోయిరాల అందాలు, కమల్ హాసన్ నటన హైలైట్గా నిలిచాయి.
తన కళ్ల ముందు అన్యాయం జరిగితే సాటి భారతీయుడిగా తట్టుకోలేని వృద్ధుడి క్యారెక్టర్లో కమల్ నటన అద్భుతం. ఆ సినిమాకి అంతకు మించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఉండబోతోందట. స్వాతంత్రోద్యమానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఈ సినిమాలో చూపించనున్నాడట శంకర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతార్జాతీయ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శంకర్ 'రోబో 2.0' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'రోబో'కి సీక్వెల్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పూర్తి కాగానే 'భారతీయుడు - 2' సినిమా పట్టాలెక్కనుంది.
|