'అర్జున్ రెడ్డి' సినిమాతో అనూహ్యంగా హిట్ కొట్టేసి, పాపులర్ హీరోయిన్ అయిపోయింది ముద్దుగుమ్మ షాలినీ పాండే. నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో. ఎంట్రీతోనే రికార్డు హిట్ కొట్టేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగులో నే కాకుండా, తమిళం నుండీ ఈ ముద్దుగుమ్మకి ఛాన్సెస్ వచ్చేస్తున్నాయ్. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా, పక్కా ప్లానింగ్తో దూస్కెళ్తోందీ బ్యూటీ. తమిళ్లో ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న '100 పర్సెంట్ కాదల్' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్కి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది. కాగా తెలుగులో మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలోనూ నటిస్తోంది. ఇవన్నీ ఒకెత్తు. తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా కోసం అమ్మడిని ఎంపిక చేశారట. సుధీర్ వర్మ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో షాలినీ పాండే కోసం ఓ బెస్ట్ క్యారెక్టర్ రెడీ చేశారట.
ఆ క్యారెక్టర్లో షాలినీ అయితేనే బావుంటుందని చిత్ర యూనిట్ యోచిస్తోందట. దాంతో ఆ క్యారెక్టర్కి ఈ ముద్దుగుమ్మనే ఫైనల్ చేశారనీ తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే ముద్దుగుమ్మ నివేదా థామస్ని వన్ ఆఫ్ ది హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్గా షాలినీ ఎంపికైంది. కాగా శర్వానంద్ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడుతో పరుగులు తీస్తోంది. వరుస హిట్లతో శర్వానంద్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ తరుణంలో శర్వానంద్ సినిమాలో ఈ ముద్దుగుమ్మకి ఆఫర్ అంటే లక్ కాక ఇంకేంటి! ఇలాగే వరుస ఆఫర్స్తో 'ఆర్జున్రెడ్డి' బ్యూటీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కళకళలాడుతూ ఉండాలని ఆశిద్దాం!
|