నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన 'శివ' చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఓ సెన్సేషనల్ చిత్రం. యూత్ని బాగా ఇన్స్పైర్ చేసిన చిత్రం. అలాగే ఈ తరహా కాన్సెప్ట్లో సినిమా తెరకెక్కడం ఇదే తొలిసారి. ఆ రకంగా ఇండస్ట్రీ దృస్టిని ఆకర్షించిన చిత్రమది. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో 'గోవిందా గోవిందా', అంతం' తదితర చిత్రాలు తెరకెక్కినా, ఈ కాంబినేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం 'శివ'నే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో అలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ మళ్లీ తెరకెక్కబోతోంది. ఈ నెల 20 న ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇటీవలే 'రాజుగారి గది - 2' సినిమాతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఇప్పుడు తెరకెక్కబోతోన్న తాజా చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ అట.
రామ్ గోపాల్ వర్మ స్టోరీ చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ ఫీలయ్యారట నాగ్. వెంటనే స్టోరీ నచ్చేసి ఓకే చేసేశాననీ నాగ్ స్వయంగా చెప్పారు. ఎప్పటినుండో ఈ కాంబినేషన్ తెరకెక్కాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ ఇప్పటికి సెట్ అయ్యింది. నాగార్జున ఎప్పుడూ సక్సెస్, ఫెయిల్యూర్స్కి ప్రిపరెన్స్ ఇవ్వరు. కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే కొత్త కొత్త కథలు నాగ్ నుండి వస్తూ ఉంటాయి. కొత్త కొత్త డైరెక్టర్స్ పరిచయం అవుతూ ఉంటారు ఆయన ద్వారా. ఈ కారణాలన్నీ ఆయన్ని హీరోగా ఈ స్థానంలో నిలబెట్టాయి. యాక్షన్ ఎంటర్టైనర్ అయినా కానీ ఇదో డిఫరెంట్ యాక్షన్ మూవీ అట. చాలా కొత్తగా ఉండబోతోందట. కథ విన్నప్పుడే చాలా ఇన్స్పైర్ అయ్యారట నాగ్. వర్మ కూడా ఈ సినిమాని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అందుకే ఈ సినిమాని వర్మ సొంతంగా తన బ్యానర్ అయిన 'కంపెనీ'లో నిర్మిస్తున్నారు. అన్నట్లు గతంలో 'శివ' సినిమాని ఎక్కడయితే స్టార్ట్ చేశారో అక్కడే ఈ సినిమాని కూడా స్టార్ట్ చేస్తుండడం మరో విశేషం. ఇదిలా ఉండగా, నాగ్ ఖాతాలో ఓ మల్టీ స్టారర్ కూడా ఉంది. నేచురల్ స్టార్ నానితో నాగ్ ఓ సినిమాలో నటిస్తున్నారు.
|