ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డుల్ని ప్రకటించింది. వాటిలో 2015 సంవత్సరానికి ఉత్తమ నటి అవార్డును అనుష్క సొంతం చేసుకుంది. 'సైజ్ జీరో' సినిమాకి గానూ అనుష్కకి ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు అనుష్కకి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడింది. ఏ హీరోయిన్ చేయని రిస్క్ చేసింది ఈ సినిమా కోసం. అనూహ్యంగా తన శరీరం బరువు పెంచుకుంది. చాలా చాలా ఫేటీగా మారిపోయింది అనుష్క. ఓ హీరోయిన్ ఇలా మారిపోవడం అంటే, తన కెరీర్ని రిస్క్లో పెట్టినట్లే. అప్పటికే అనుష్క స్టార్ హీరోయిన్. 'బాహుబలి ది బిగినింగ్' వంటి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి టైంలో తన శరీరాన్ని ఇలా రిస్క్లో పడేయడమంటే అందరూ అనుష్క గురించి భయపడ్డారు కూడా.
అయితే అనుష్క మాత్రం ఏ మాత్రం భయం లేకుండా, ఎంతో డెడికేషన్తో ఈ ప్రయోగం చేసింది. అనుష్క చేసిన ఈ ప్రయోగానికి బంగారు నంది కూడా ఆమె ముందు చిన్నబోతుందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఆమె కష్టానికి తగిన ఫలితం అయితే దక్కిందని చెప్పొచ్చు. అందుకే అనుష్కకి ఈ అవార్డు వెరీ వెరీ స్పెషల్ అంటోంది. ఆ తర్వాత ఆ పెరిగిన బరువును తగ్గించుకునేందుకు అనుష్క పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చేతి నిండా భారీ ప్రాజెక్టులే. ఒక పక్క భారీగా పెరిగిన శరీరం. ఇవన్నీ వెరసి, అనుష్క అభిమానుల్లో అంతులేని అనుమానాలు. అసలు అనుష్క ఈ భారీ శరీరం నుండి విముక్తి పొంది మళ్లీ ఎప్పుడు సన్నజాజిలా తయారవుతుంది అని భయపడ్డారు. మొత్తానికి అనుష్క మళ్లీ నాజూకు అందాలతో భారీ ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం 'భాగమతి' సినిమాలో నటిస్తోంది అనుష్క. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'భాగమతి' ఫస్ట్లుక్కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
|