ముద్దుగుమ్మ సాయేషా శర్మ తెలుగులో అవకాశాల కోసం తెగ ఎదురు చూస్తోందట. 'అఖిల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. భారీ అంచనాల నడుమ, గంపెడు ఆశలతో ఈ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. కానీ సినిమా నిరాశ పరచడంతో పాపం అమ్మడి టాలెంట్ని ఎవ్వరూ గుర్తించనే లేదు. డాన్సుల్లోనూ, నటనలోనూ తన వంతు కష్టపడింది ఈ బ్యూటీ. మార్కులు బాగానే వేయించుకుంది. కానీ టాలెంట్ ఉన్నా మాత్రం అదృష్టం కలిసి రావాలి కదా. ఆ అదృష్టం సక్సెస్ అయి ఉండాలి. కానీ ఆ సక్సెస్ అమ్మడికి దక్కలేదు. సో అమ్మడి తన టాలెంట్ని మరింతగా తెలుగు ప్రేక్షకులకు చూపించే అవకాశం లేకపోయింది.
'అఖిల్' పూర్తిగా నిరాశ పరచడంతో మరో ఛాన్సే దక్కలేదు ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్లో అక్షయ్ కుమార్తో 'శివాయ్' సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. మొన్నీమధ్యనే 'వనమగన్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఓ పాటకి ప్రభుదేవా అందించిన కొరియోగ్రఫీతో సోషల్ మీడియాలో అమ్మడి పేరు మార్మోగిపోయింది. ఆ పాటలో సాయేషా వేసిన స్టెప్పులకి డాన్స్ ప్రియులంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఆర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది. సంతోష్. పి. జయకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్తో కలిసి ఆర్య సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఇది కాక విజయ్ సేతుపతితో 'జుంగా' సినిమాలో నటిస్తోంది. కార్తీతో మరో సినిమా చేస్తోంది సాయేషా. మొత్తానికి అమ్మడి అదృష్టం కోలీవుడ్కి కలిసొచ్చినట్లుంది. ఇక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోందిప్పుడు సాయేషా సైగల్. అలాగే తమిళంతో పాటు తెలుగులోనూ నటించాలని అనుకుంటోందట. అయితే మన దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మకి ఎప్పుడు ఛాన్సిచ్చి, రీ వెల్కమ్ చెబుతారో చూడాలి మరి.
|