ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. 'మజ్ను' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటూ టాలీవుడ్లో దర్శక, నిర్మాతలకు మొదటి ఆప్షన్గా నిలిచింది. ప్రస్తుం ఈ బ్యూటీ చేతిలో వరుస సినిమాలున్నాయి. వాటిలో 'అజ్ఞాతవాసి' సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్కళ్యాణ్తో ఈ ముద్దుగుమ్మ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది. అంతేకాదు పక్కా గ్లామరస్ లుక్తో అలరించనుంది ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్. మరోపక్క అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. నాగ చైతన్యతో ఓ సినిమాకి కమిట్ అయ్యిందట ఈ బ్యూటీ. తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ ఈ బ్యూటీనే హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు.
ఇదిలా ఉండగా చరణ్ - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకీ ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్ అనుకుంటున్నారనీ తెలియవస్తోంది. ఈ సినిమాలో చరణ్కి జోడీగా మొదట్లో రకుల్ ప్రీత్ సింగ్ని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ అనూ ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కాక, రాజమౌళి తెరకెక్కించబోయే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్లోనూ అనూ ఇమ్మాన్యుయేల్నే హీరోయిన్ అనుకుంటున్నారంటే ఈ బ్యూటీ మ్యాజిక్ ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా.. ఒక్కటేమిటి ఇన్ని బంపర్ ఛాన్స్లతో ఉక్కిరి బిక్కిరయిపోతోంది ఈ అందాల భామ. తక్కువ టైంలోనే ఇన్ని ఆఫర్లు దక్కించుకుని లక్కీ బ్యూటీ అయిపోయింది అనూ ఇమ్మాన్యుయేల్. ఏడాది మొదట్లోనే 'అజ్ఞాతవాసి' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఈ బ్యూటీకి వచ్చే ఏడాది అంతా పండగే పండగ.
|