పవన్ కళ్యాణ్ సినిమా అయినాసరే, విడుదలకు ముందు పైరసీకి గురయ్యిందంటే నిర్మాత గుండెలు బాదుకోవాల్సిందే. అదే జరిగింది 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో. పాపం నిర్మాత, తన సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిందని తెలుసుకుని, కంటతడి పెట్టారు. తీవ్రమైన ఆవేదనకూ గురయ్యారు.
అయితే పవన్ అభిమానులు వేగంగా స్పందించారు. పోలీసులూ స్పీడ్ స్పీడ్ గా విచారణ ప్రారంభించి, నిందితుల్ని పట్టుకున్నారు. ఎడిటింగ్ టేబుల్ నుంచే సినిమా పైరసీకి గురయినట్లుగా కనుగొన్న పోలీసులు సినిమా పరిశ్రమకు కొంత మేలు చేశారని చెప్పవచ్చును.
అదలా ఉంచితే, సినిమా పైరసీకి గురైనా, ఫస్టాఫ్ అంతా చాలామందికి చేరిపోయినా, అడ్వాన్స్ ఓపెనింగ్లు అడ్డూ అదుపూ లేకుండా జరిగిపోయాయి. భారీయెత్తున బెనిఫిట్ షోలకూ అభిమానులు ప్లాన్ చేశారు. 27వ తేదీన సినిమా విడుదలయ్యే ధియేటర్ల వద్దకు వస్తే పవనిజం సత్తా ఏంటో చూపిస్తామన్నారు.
అన్నమాట ప్రకారం థియేటర్లు కళకళ్ళాడుతున్నాయి అభిమానులతో. దాంతో పవన్ దెబ్బకి పైరసీ మట్టి కరిచిందని అందరూ ఒప్పుకుంటున్నారు.
|