పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్ చేసింది, వరల్డ్ కప్ క్రికెట్ పోటీల సందర్భంగా. టీమిండియా, పాకిస్తాన్ మీద గెలిస్తే మైదానంలో నగ్నంగా కన్పిస్తానని చెప్పిందామె. ఆమె ఉద్దేశ్యం ఏదైనా, భారత్ గెలిచింది, కానీ పూనమ్ పాండే నగ్న దేహాన్ని చూసే 'ప్రమాదం' తప్పింది. జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని తప్పించుకున్న పూనమ్, మళ్ళీ కప్ గెలిస్తే న్యూడ్ గా కన్పిస్తానని చెప్పింది. మళ్ళీ అదే తంతు.
పూనమ్ పాండేని చూసి వాతలు పెట్టుకున్న గెహనా వశిష్ట్, జాతీయ పతాకాన్ని తన నగ్న దేహానికి చుట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఒలింపిక్స్ లో ఇండియా గెలిస్తే నగ్నంగా రోడ్లపై నడుస్తానని అచ్చం పూనమ్ పాండేలా పబ్లిసిటీ స్టంట్ చేసింది. ఇది జరిగి కొన్ని రోజులయ్యింది.
దీని గురించి 'గో తెలుగు' ఆమెను ప్రశ్నిస్తే, ఎలాగూ గెలవరు కాబట్టే అలా అన్నాననీ, ఒకవేళ గెలిచి వుంటే మాట మార్చేదాన్ననీ చెప్పింది గెహనా వశిష్ట్. ఒలింపిక్స్ లో ఇండియా గెలవదన్న నమ్మకమేంటి? అని ప్రశ్నిస్తే, రెండో ఆప్షన్ వుంది కాబట్టి, గెలిచినా నగ్నంగా రోడ్డెక్కాల్సిన అవసరం లేదని గెహనా వెల్లడించింది. 'నేను భారతనారిని ఆ పని చేయలేను, ఊరికే ఆటగాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అలాగన్నాను' అని మాట మార్చేదట గెహనా.
|