మోహన్బాబు అంటే కలెక్షన్ కింగ్. డైలాగ్ కింగ్ ఇలా పలు రకాల బిరుదులున్నాయి. ఆయన చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'గాయత్రి'. మదన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్బాబు డిఫరెంట్ లుక్లో కనిపిస్తూ, డిఫరెంట్గా ఆకట్టుకుంటున్నారు ఈ సినిమా ప్రోమోస్లో. సోషల్ అవేర్నెస్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమాలా 'గాయత్రి' ప్రమోట్ అవుతోంది. మోహన్బాబు రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తున్నారు. మోహన్బాబు అంటేనే డైలాగుల సునామీ. ఆ సునామీ ఈ సినిమాలో కట్టలు తెంచేసుకున్నట్లే అనిపిస్తోంది. ట్రైలర్లోనే పలు రిజిస్టర్డ్ డైలాగ్స్తో ఎప్పటిలాగే పవర్ఫుల్ పర్ఫామెన్స్తో మోహన్బాబు ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇంకా బాక్సాఫీస్ బోణీ కొట్టలేదు.
మోహన్బాబు సినిమాతో బాక్సాఫీస్ బోణీ కొడుతుందేమోనని టాలీవుడ్ ఎదురు చూస్తోంది. సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఇన్నాళ్ల కెరీర్లో ఎప్పుడూ సక్సెస్ వచ్చిందని పొంగిపోలేదు. ఫెయిల్యూర్ వచ్చిందని కుంగిపోలేదు. ప్రతీ సినిమాకీ కమిట్మెంట్తోనే ప్రయత్నిస్తాం. ఆ కమిట్మెంటే కెరీర్లో ఈ స్థాయికి తీసుకొచ్చిందని మోహన్బాబు అన్నారు. ఓ గుడ్ అటెంప్ట్ ఈ సినిమా కోసం చేశాం. సక్సెస్ ఇవ్వాలా వద్దా అనేది ప్రేక్షకుల్లో ఉంటుందనీ ఈ సినిమా ప్రమోషన్స్లో అభిమానులనుద్దేశించి మోహన్బాబు అన్నారు. మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుల్లితెర హాటెస్ట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో ఇంపార్టెన్స్ రోల్ పోషిస్తుండగా, నిఖిలా విమల్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. ఫిబ్రవరి 9న 'గాయత్రి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|