Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు సినిమాపై పగ పట్టిందెవరు?

'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా అంతార్జాతీయ స్థాయికి ఎదిగిందని సంబరపడ్డాం. దురదృష్టవశాత్తూ, వరుస సంఘటనలు తెలుగు సినిమా ఇమేజ్‌ని దెబ్బ తీస్తునాయిన్‌. కొందరు వ్యక్తుల కారణంగా పరిశ్రమ అపాసు పాలవుతోంది. డ్రగ్స్‌ రాకెట్‌, కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం నుండి తెలుగు సినీ పరిశ్రమ తేరుకుంటున్న సమయంలో సెక్స్‌ రాకెట్‌ పెద్ద షాక్‌ ఇచ్చింది. కొందరు నటీమణులతో అమెరికాలో కిషన్‌ అనే వ్యక్తి సెక్స్‌ రాకెట్‌ నడుపుతూ అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనతో అమెరికాకి వెళ్లే తెలుగు సినీ హీరోయిన్స్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ ప్రముఖ హీరోయిన్‌ ఇటీవల అమెరికాకి వెళ్లగా అక్కడ ఆమెని సెక్స్‌ రాకెట్‌ గురించి ప్రశ్నించారు. ఊహించని పరిణామంతో అవాక్కయ్యింది ఆ నటి.

కుటుంబ సభ్యులను కలిసేందుకు అమెరికా వచ్చానని సెక్స్‌ రాకెట్‌ గురించి తనకేమీ తెలియదనీ ఆమె చెప్పడంతో, ఆక్కడి పోలీసులు తప్పయిపోయిందనీ ఆమెను విడిచిపెట్టేశారు. ఇటీవల సినీ పరిశ్రమ గురించి గొప్పగా చెబుతూ, పలువురు ప్రముఖుల మీడియా ముందుకు వచ్చారు. వాళ్లంతా ఇప్పుడు మళ్లీ స్పందించాలి. సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చే ఎలాంటి చర్యలను, ఉపేక్షించబోమనీ, గట్టి సంకేతాలు పంపారు. ఎవరో ఏదో చేస్తే మాకేంటి సంబంధం అని మౌనంగా కూర్చోకూడదు. తెలుగు సినీ కళామతల్లి బిడ్డలుగా పరిశ్రమ గౌరవం పెంచాలి తప్ప ఎవ్వరూ అపఖ్యాతి తీసుకురాకూడదు.

మరిన్ని సినిమా కబుర్లు