గతేడాది 'శతమానం భవతి' సినిమాతో మంచి విజయం అందుకున్న ముద్దుగుమ్మ అనుపమ, 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో నిరాశ పరిచింది. అయినా కానీ అనుపమ ఫుల్ బిజీగా ఉంది. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలో రామ్తో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ రామ్తోనే మరో కొత్త సినిమాకి ఓకే చేసింది. ఆ సినిమాకి 'హలో గురూ ప్రేమ కోసమే' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నేచురల్ స్టార్ నానితో 'నేను లోకల్' సినిమాని తెరకెక్కించిన నక్కిన త్రినాధరావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటు అనుపమకి, అటు రామ్కీ ఇద్దరికీ ప్రెస్టీజియస్ మూవీ అట. ఎందుకంటే తొలిసారిగా వీరిద్దరూ జత కట్టిన చిత్రం 'జిందగీ' నిరాశ పరచడంతో ఈ సినిమాతో ఎలాగైనా ఈ జంట హిట్ కొట్టాలనే కసితో ఉన్నారట. కథలో బలం కూడా వీరి నమ్మకానికి నిదర్శనం. ముఖ్యంగా కథా బలం ఉన్న చిత్రాలనే దిల్ రాజు ఎంచుకుంటారు. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలంతే. అనుపమకు కెరీర్ బెస్ట్ హిట్ అయిన 'శతమానం భవతి' సినిమాని నిర్మించింది కూడా దిల్రాజే. సో అనుపమ ఆనందానికి అవధుల్లేవట. రామ్ తనకి మంచి స్నేహితుడునీ, రామ్తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందంటోంది. మరో పక్క ఈ ముద్దుగుమ్మ మెగా కాంపౌండ్లో కూడా అడుగు పెట్టింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో ఓ సినిమాలో నటిస్తోంది. లవ్స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
|