భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న రామ్చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం'. తాజాగా ఈ సినిమా నుండి మరో ఆడియో సింగిల్ వచ్చింది. అదే పూజా హెగ్దే ఐటెం సాంగ్. 'జిగేల్ రాణీ..' అంటూ పూజా హెగ్దే చిందేసిన ఈ ఐటెం సాంగ్ కోసమే అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రానే వచ్చింది. రావడం రావడమే సాంగ్ యూ ట్యూబ్లో దుమారం లేపుతోంది. సుక్కు - దేవిశ్రీ కాంబినేషన్లో ఐటెం సాంగ్ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఇంతవరకూ ఈ కాంబినేషన్లో వచ్చిన అన్ని ఐటెం సాంగ్స్ వేటికవే ప్రత్యేకమైనవి. వాటిన్నింటినీ తలదన్నేలా 'రంగస్థలం'లోని 'జిగేల్ రాణీ..' సాంగ్ ఉందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
క్యూట్ అండ్ మోడ్రన్ ఎక్స్ప్రెషన్స్తో కవ్వించే పూజా హెగ్దే ఈ సాంగ్లో మాస్ ఎక్స్ప్రెషన్స్తో కిర్రాకు పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే, మొన్నీ మధ్యనే విడుదలైన 'రంగమ్మా మంగమ్మా..' సాంగ్లోని 'గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే..' అనే లిరిక్ వివాదాస్పదమైంది. ఈ లిరిక్ యాదవ మహిళల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందనీ, వెంటనే ఆ లిరిక్ని తొలిగించాలనీ, ఆల్ ఇండియా యాదవ సంఘం అధ్యక్షులు రాములు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి చిత్ర యూనిట్ ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందా? లేక లైట్ తీసుకుంటుందో! వివాదం సంగతి పక్కన పెడితే 'రంగస్థలం' సినిమా మార్చి 30న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది.
|