Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

'మెహబూబా' - పూరీ జగన్నాధ్‌ ఈజ్‌ బ్యాక్‌

purijagannaatha is back

క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మెహబూబా'. తాజాగా టీజర్‌ విడుదలైంది. టీజర్‌కి రెస్పాన్స్‌ అదరిపోతోంది. టీజర్‌ చూసిన వాళ్లంతా పూరీ జగన్నాధ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు. ఇండియా - పాకిస్థాన్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే స్టోరీ ఇది. యుద్ద సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించాడనీ, టీజర్‌తో చెప్పకనే చెప్పేశాడు పూరీ. ఎంతో మంది హీరోలను స్టార్‌ హీరోలుగా తీర్చి దిద్దిన ఘనత పూరీ జగన్నాధ్‌కి ఉంది. తన కొడుకు ఆకాష్‌ పూరీతో తొలిసారిగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఎంతైనా కొడుకు సినిమా కదా. ఇంకాస్త ఎక్కువే కాన్‌సన్‌ట్రేషన్‌ పెట్టినట్లుంది. ఆకాష్‌ పూరీ ఆల్రెడీ చైల్డ్‌ ఆర్టిస్టుగానే తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాకి చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాడు.

డైలాగ్‌ డెలివరీ విషయంలో, సైనికుడిగా తన అప్పియరెన్స్‌ విషయంలో చాలా పరిణీతి సాధించినట్లు కనిపిస్తున్నాడు. అందాల భామ నేహా శెట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. టీజర్‌లో పాకిస్థాన్‌ ఫ్లేవర్‌ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ బోర్డర్‌ సన్నివేశాల చిత్రీకరణను చాలా ఇన్నోవేటివ్‌గా, నేచురల్‌గా కళ్లకు కట్టినట్లుగా తీర్చి దిద్దాడనిపిస్తోంది. ఓ పక్క యుద్ధ ఘట్టాలు, మరో పక్క క్యూట్‌ లవ్‌స్టోరీ రెండింటి మిళితమే ఈ 'మెహబూబా'. చాలా క్రిటికల్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. సమ్మర్‌లోనే 'మెహబూబా' చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పూరీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
tollywood time mission is back