గతంలో సుచీ లీక్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలైన సంగతి మర్చిపోకుండానే, తాజాగా టాలీవుడ్లో శ్రీరెడ్డి లీక్స్ స్టార్ట్ అయ్యాయి. సుచీ లీక్స్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాగా, ఈ శ్రీరెడ్డి మాత్రం సోషల్ మీడియాతో పాటు, ఈ మీడియా, ఆ మీడియా అనే తేడా లేకుండా, లైవ్లో ఆరోపణలు చేసేస్తోంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు, ప్రొడ్యూసర్లు అనే తేడా లేకుండా, అందరిపైనా అసభ్యకరంగా ఆరోపణలు చేస్తూ, నిత్యం హాట్ టాపిక్గా మారింది. అసలింతకీ ఆమె ఆరోపణల్లో నిజమెంత? ఆధారాలున్నాయంటోంది. కానీ ఆ ఆధారాలు బయటికి తీసుకురాదే? ఇండస్ట్రీలోని కొందరు మహిళలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు.
అవకాశాలు రాకపోతే మరీ ఇంత నీచ స్థితికి దిగజారిపోతారా? అంటూ ఆమెను మందలించే ప్రయత్నం చేస్తున్నా, ఆమె ఏమాత్రం సంకోచించకుండా, తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఒక్కొక్కటిగా తన వద్ద ఉన్న ఆధారాలతో ఫోటోలు, వాట్సాప్ ఛాటింగ్స్తో సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తోంది. ప్రముఖ నిర్మాత సురేష్బాబు తనయుడు, రానా తమ్ముడు తనను ప్రేమించి మోసం చేశాడంటూ, అతనితో క్లోజ్గా దిగిన ఫోటోలను విడుదల చేసింది. ఇతర ప్రొడ్యూసర్లు, దర్శకులపై అతి ఘోరమైన నీచమైన ఆరోపణలు చేస్తోంది. అమ్మడి టార్గెట్ కేవలం మగవారు మాత్రమే కాదండోయ్. ఆడవాళ్లను అంటే హీరోయిన్స్ని కూడా వదలడం లేదు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ని ఆడేసుకుంటోంది. ప్రముఖ నిర్మాత, రచయిత అయిన కోనవెంకట్, డైరెక్టర్ కొరటాలశివ, ఇతర నటీ నటులపై ఆమె ఆరోపణలు చేసింది. ఇక్కడితో సరిపెడితే ఫర్వాలేదు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. మరి దీనికి అడ్డుకట్ట వేసేందుకు టాలీవుడ్ ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోందో వేచి చూడాలిక.
|