Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Kirti suresh make magic as 'Mahanaty'

ఈ సంచికలో >> సినిమా >>

కళ్యాణ్‌రామ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.!

kalyan ram suspense triller

ఇటీవలే 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, త్వరలోనే 'నా నువ్వే' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్న కళ్యాణ్‌రామ్‌ కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ గుహన్‌ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గుహన్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్టోరీ లైన్‌ కళ్యాణ్‌రామ్‌ని ఇంప్రెస్‌ చేసిందట. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. తొలిసారిగా ఇలాంటి జోనర్‌లో నటిస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేశాడు. కాజల్‌ అగర్వాల్‌, తమన్నా వంటి సీనియర్‌ స్టార్‌ ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ ఆడి పాడిన కళ్యాణ్‌రామ్‌ ఈ సారి ఆ విషయంలోనూ కొత్తదనం చూపించాడు.

ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలకు చోటుంది. 'జెంటిల్‌మెన్‌'తో పరిచయమై, 'జై లవకుశ'లో ఎన్టీఆర్‌కి జోడీగా నటించిన ముద్దుగుమ్మ నివేధా థామస్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, 'అర్జున్‌రెడ్డి'తో పాపులర్‌ అయిన మరో భామ షాలినీ పాండే మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రకంగా అన్నివైపులా ఈ సినిమాతో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. కొత్త డైరెక్టర్‌, కొత్త కాన్సెప్ట్‌, కొత్త భామలు, అబ్బో కళ్యాణ్‌రామ్‌లో చాలా మార్పు వచ్చిందండోయ్‌. అలాగే తనలోని న్యూ యాంగిల్‌ని ఈ సినిమాతో బయటికి తీసేస్తాడట. కాస్కోండి మరి. మే లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందట. 

మరిన్ని సినిమా కబుర్లు
teja handed over to NTR