ఇటీవలే 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, త్వరలోనే 'నా నువ్వే' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్న కళ్యాణ్రామ్ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ గుహన్ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గుహన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్టోరీ లైన్ కళ్యాణ్రామ్ని ఇంప్రెస్ చేసిందట. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. తొలిసారిగా ఇలాంటి జోనర్లో నటిస్తున్నాడు కళ్యాణ్రామ్. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేశాడు. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి సీనియర్ స్టార్ ముద్దుగుమ్మలతో ఆన్ స్క్రీన్ ఆడి పాడిన కళ్యాణ్రామ్ ఈ సారి ఆ విషయంలోనూ కొత్తదనం చూపించాడు.
ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలకు చోటుంది. 'జెంటిల్మెన్'తో పరిచయమై, 'జై లవకుశ'లో ఎన్టీఆర్కి జోడీగా నటించిన ముద్దుగుమ్మ నివేధా థామస్ ఓ హీరోయిన్గా నటిస్తుండగా, 'అర్జున్రెడ్డి'తో పాపులర్ అయిన మరో భామ షాలినీ పాండే మరో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రకంగా అన్నివైపులా ఈ సినిమాతో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్రామ్. కొత్త డైరెక్టర్, కొత్త కాన్సెప్ట్, కొత్త భామలు, అబ్బో కళ్యాణ్రామ్లో చాలా మార్పు వచ్చిందండోయ్. అలాగే తనలోని న్యూ యాంగిల్ని ఈ సినిమాతో బయటికి తీసేస్తాడట. కాస్కోండి మరి. మే లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.
|