టాలీవుడ్లో పలువురు ప్రముఖులు తనను లైంగికంగా వేధించారంటూ మీడియాకెక్కిన నటి శ్రీరెడ్డి నోటికి హద్దూ అదుపూ ఉండడం లేదు. పవన్కల్యాణ్పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గట్టిగా స్పందించి, పవన్ కల్యాణే డైరెక్ట్గా రంగంలోకి దిగడం, శ్రీరెడ్డి వంటి వారిని ప్రోత్సహించడంలో మీడియా చూపిన అత్యుత్సాహం పట్ల గళం విప్పడంతో, కొన్ని రోజులు శ్రీరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇష్యూ కాస్త కామ్అప్ అయినట్లుగా కనిపించింది. అయితే శ్రీరెడ్డి మళ్లీ వెలుగులోకి వచ్చింది. సిని పరిశ్రమపై ఎక్కడయితే తన అనుచిత ఆరోపణలను ఆపిందో అక్కడి నుండే మళ్లీ మొదలు పెట్టింది. నేచురల్ స్టార్ నానిపై అసందర్భ ప్రేలాపనతో విరుచుకుపడింది. నానిని కామాంధుడిగా అభివర్ణించింది. అలాగే సినీ నటి, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన రోజాపై కూడా శ్రీరెడ్డి తన ఆరోపణలతో దూషణలు చేసింది. దాంతో శ్రీరెడ్డి మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఇదివరకటిలా మీడియా ఆమెను ప్రోత్సహించడం లేదు. స్టూడియోలకు పిలిపించి, గంటల కొద్దీ డిస్కషన్స్ పెట్టడం లేదు. ఆమె విజృంభణ, ప్రతాపం అంతా సోషల్ మీడియాలోనే. ఆడవారిపై కాస్టింగ్ కౌచ్ అని మొదలుపెట్టిన తన ఉద్యమ పర్వం, ఇప్పుడు మగవారిపై కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనేదాకా వెళ్లింది. పలువురు సీనియర్ దర్శకులు తమ కింద పని చేసే అసిస్టెంట్స్ని లైంగికంగా వాడుకుంటున్నారనీ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. దాంతో ఇష్యూ మరింత క్రిటికల్ అయ్యింది. అయినా కానీ మొదట్లో వచ్చిన పబ్లిసిటీ, పాపులారిటీ ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్కి రావడం లేదు. నోటికొచ్చినట్లు ఎంతగా తిడుతున్నా, ప్రస్తుతం ఎవ్వరూ ఆమెని పట్టించుకోవడం లేదు పాపం.!
|