నాగార్జున - రామ్గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆఫీసర్' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల పోస్ట్పోన్ అయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 1న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని సినిమా డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ప్రకటించారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. మరో పక్క సినిమా విడుదల దగ్గరపడినా, ప్రమోషన్స్లో ఎక్కడా హడావిడి కనిపించడం లేదు. వర్మ తన సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్ కారణాల రీత్యా సినిమాని అనుకున్న టైంకి విడుదల చేయలేకపోతున్నామని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక సినిమా పబ్లిసిటీ విషయమంటారా? ఈ విషయంలో వర్మ రూటే సెపరేటు.
ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే వర్మ, ఓ కొత్త వివాదాన్ని తెర పైకి తెచ్చి, దాన్ని సినిమా పబ్లిసిటీ కోసం వాడుకున్నా వాడుకుంటాడు. నాగార్జున - వర్మ కాంబినేషన్లో దాదాపు 28 ఏళ్ల తర్వాత తెరకెక్కిన చిత్రం కాబట్టి, ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే సినిమా పోస్ట్పోన్ అవడంతో ఓ పక్క వర్మ అభిమానులు, మరో పక్క నాగార్జున అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. టెక్నాలజీని బాగా యూజ్ చేసుకునే వర్మ, ఈ సినిమాతో సరికొత్త సాంకేతిక విలువల్ని చూపించనున్నారట. అందుకే కాస్త ఎక్కువ టైం తీసుకుంటోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఇటీవల విడుదలైన 'ఆఫీసర్' టీజర్స్, ట్రైలర్ సినిమాపై ఆశక్తిని బాగా పెంచాయి. మిరా సరీన్ అనే కొత్తమ్మాయిని ఈ సినిమాతో వర్మ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.
|