అత్యంత లాంఛనంగా తేజ దర్శకత్వంలో ప్రారంభమైన 'ఎన్టీఆర్' బయోపిక్ నుండి తేజ తప్పుకోవడంతో ఇక ఈ బయోపిక్ ఆగిపోయినట్లే అనుకున్నారంతా. కానీ బాలయ్య ఈ ప్రాజెక్టును ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎలాగైనా ఈ ప్రాజెక్టుకు దృశ్యరూపం ఇవ్వాలనే కసితో ఉన్నారు. ఆ దిశగా తన నూరవ చిత్రాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించి, సంచలన విజయం సాధించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని ఈ ప్రాజెక్టులో భాగం చేశాడు. తేజ తప్పుకోవడంతో పలువురు డైరెక్టర్స్ని దాటుకుని 'ఎన్టీఆర్' బయోపిక్ క్రిష్ చేతికొచ్చింది. క్రిష్ చేతికొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి.
క్రిష్ చేతిలో పడ్డాక 'ఎన్టీఆర్' బయోపిక్పై అంచనాలు పదింతలయ్యాయి. ఆల్రెడీ చారిత్రక చిత్రాలను తెరకెక్కించిన అనుభవం ఉన్న క్రిష్ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్లో స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని వాటిని మాత్రమే తెరపై పొందుపరచనున్నారనీ తెలుస్తోంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్పై ఓ క్లారిటీ వచ్చేసింది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఇక కాస్టింగ్లో కూడా త్వరలోనే ఫైనల్ క్లారిటీకి రానున్నారట. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్లో 'మణికర్ణిక' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పనులు పూర్తి కాగానే క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్పై దృష్టి పెట్టనున్నాడట. అంటే త్వరలోనే బాలయ్య 'ఎన్టీఆర్' పూర్తి కావడం ఖాయం. ఇక మిగిలిన ఎన్టీఆర్ బయోపిక్స్ సంగతేంటనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
|