టాలీవుడ్లో సినిమాల ట్రెండ్ మారింది. మల్టీ స్టారర్స్కి మన హీరోలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్స్కి కాలు దువ్వుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్లో నాలుగైదు మల్టీస్టారర్స్కి రంగం సిద్ధమవుతోందంటే నమ్మి తీరాల్సిందే. ముందుగా చెప్పుకోదగ్గ మల్టీ స్టారర్ కాంబినేషన్ వెంకీ - వరుణ్ కాంబినేషన్. 'ఎఫ్ 2' ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే టైటిల్తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరో కాంబినేషన్ నాగ్ అండ్ నాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇకపోతే ముచ్చటగా మూడో చిత్రంగా మహేష్బాబు - అల్లరి నరేష్ కాంబినేషన్. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో మినీ మల్టీ స్టారర్ యంగ్ హీరో నితిన్ - శర్వానంద్ కాంబినేషన్. ఈ సినిమాని 'దాగుడు మూతలు' టైటిల్తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు అసలు సిసలు మెగా మల్టీ స్టారర్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో రానుంది. ఇలా ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్స్ హవా కొనసాగుతోంది. ఆల్రెడీ మహేష్ - వెంకీ, వెంకీ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్స్ మంచి విజయాలు అందుకున్నాయి. ఇంతవరకూ బాలీవుడ్లోనే ఎక్కువగా మల్టీ స్టారర్స్ ట్రెండ్ చూసే వాళ్లం. ఆ ట్రెండ్ని సరికొత్తగా మన టాలీవుడ్ హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నారు.
|