అందాల తార అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం 'ధడక్' అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా జాన్వీ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొంటోంది. తొలిసారిగా జాన్వీకపూర్ ఫోటో కవర్ పేజీపై సందడి చేస్తోంది. వోగ్ అనే ఓ మేగ్జైన్ కవర్ పేజీ మీద జాన్వీకపూర్ హాట్ హాట్ పోజులతో ఫోటోలకు పోజిచ్చింది. ఇకపోతే జాన్వీకపూర్ని హీరోయిన్గా చూడాలని శ్రీదేవి ఎన్ని కలలు కనిందో అందరికీ తెలిసిందే. తన స్థాయిలో జాన్వీని కూడా అభిమానులకు దగ్గర చేయాలని తాపత్రయ పడింది శ్రీదేవి. ఎట్టకేలకు ఆమె హీరోయిన్గా నటించిన తొలి చిత్రం 'ధడక్' విడుదలకు సిద్ధమైంది. కానీ తెరపై తన కూతురుని హీరోయిన్గా చూసుకునేందుకు శ్రీదేవి జీవించి లేదు.
జీవించి ఉండగా అమ్మ కలను నెరవేర్చలేకపోయానే అని జాన్వీ కపూర్ తనలో తానే పడుతున్న ఆవేదనను ఎవ్వరూ తీర్చలేరనే చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే, కన్నడలో ఘన విజయం సాధించిన 'సైరత్' మూవీకి హిందీ రీమేక్గా తెరకెక్కుతోందీ చిత్రం. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇప్పటికి జాన్వీ కపూర్ హిందీలోనే తెరంగేట్రం చేస్తోంది. ఒకవేళ శ్రీదేవి జీవించి ఉంటే, జాన్వీ తెలుగులోనూ హీరోయిన్గా పరిచయమయ్యేదేమో. శ్రీదేవిలా జాన్వీని కూడా తెలుగు ప్రేక్షకులు కళ్లల్లో పెట్టుకుని చూసుకునేవారేమో. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. శ్రీదేవి మరణంతో జాన్వీ కెరీర్ అస్తవ్యస్తమైపోయింది. ఆమె మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలేంటో ఇంకా సస్పెన్స్గానే మిగిలిపోయాయి.
|