'నా పేరు సూర్య' సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. కానీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. భారీగా నిరాశపరిచాడు అల్లు అర్జున్ ఈ సినిమాతో. 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి' 'సరైనోడు' సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన అల్లు అర్జున్ తర్వాత వరుసగా 'డీజె', 'నా పేరు సూర్య'తో నిరాశపరిచాడు. నిజానికి ఈ రెండూ డిజాస్టర్స్ కావు. రెండూ 50 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలే కానీ. అయితే 'రేసుగుర్రం' లాంటి హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడట ఇప్పుడు బన్నీ. 'సూర్య' తర్వాత బన్నీ విక్రమ్ కుమార్తో సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది. ఇప్పుడది కార్యరూపం దాల్చనుంది. విక్రమ్ కుమార్, బన్నీ కోసం అదిరిపోయే స్క్రిప్టు ప్రిపేర్ చేశాడట. 'మనం' వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించి, 'హలో'తో ఫర్వాలేదనిపించిన విక్రమ్ కుమార్ ఇప్పుడు చేయబోయే సినిమా బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ఉండబోతోందని నమ్మకంగా చెబుతున్నాడు.
అయితే ఈ సినిమాలో బన్నీ ఎలాంటి ప్రయోగాలు చేయడట. అందుకే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్నే చేయాలనుకుంటున్నాడట. ఆ రకంగా బన్నీ తన రూటు మార్చేశాడనీ తెలుస్తోంది. చూడాలిక రేసులో వెనకబడిపోయిన బన్నీ, మార్చుకున్న ఆలోచనతో సరైన హిట్ కొట్టి, మళ్లీ రేసులోకి ఎలా అడుగుపెడతాడో. అంతేకాదు, వరుస సినిమాలు చేసే ప్రయత్నాల్లోనూ బన్నీ ఉన్నాడట. ఆల్రెడీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బన్నీకి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. ఆ స్టోరీ పట్ల బన్నీ సుముఖంగా ఉన్నాడనీ త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్ల ఓ క్లారిటీ ఇవ్వనున్నాడనీ తాజాగా అందుతోన్న సమాచారమ్.
|