సంచలనాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర లేపనున్నాడు. తాజాగా 'వైరస్' అనే సినిమా తెరకెక్కించబోతున్నాడు. దాదాపు 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడట వర్మ. టెక్నికల్గా హై స్టాండర్ట్స్లో ఈ సినిమా ఉంటుందట. సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా సంచలనాలకు ఎప్పుడూ వేదికవుతుంటాడు రామ్గోపాల్ వర్మ. ఆ కోవలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబై వంటి ఓ మహా నగరంలో వ్యాపించిన ఓ భయంకరమైన వైరస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా, సిటీ నుండి ఎవర్నీ బయటికి పోనీయకుండా యంత్రాంగం ఎలా పని చేసిందనే అంశాన్ని హైలైట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట వర్మ. వైరస్ సోకిన మనుషులు విచక్షణ కోల్పోయి, మృగాల్లా బిహేవ్ చేస్తుంటారట. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఈ వైరస్ సోకిన కొందరు మనుషుల్ని చంపివేయాల్సిన దుస్థితిని ఈ సినిమాలో చూపించనున్నాడట వర్మ.
ఇదీ ఈ సినిమా కథ. హృద్యమైనవే కాదు, అత్యంత భయానక సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా చూడబోతున్నామట. గతంలో ఇలా వైరస్ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ పూర్తి భిన్నంగా ఇంతకు ముందెన్నడూ తెలుగు తెరపై చూడని టెక్నికల్ వేల్యూస్తో ఈ సినిమాని రూపొందించనున్నాడట వర్మ. ఇటీవలే 'ఆఫీసర్' సినిమాతో నిరాశపరిచిన వర్మ, 'వైరస్'తో ఎలాంటి సంచలనం అందుకుంటాడో చూడాలిక.
|