'వేటగాడు' సినిమాలో ఎన్టీఆర్ - శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన 'ఆకు చాటు పిందె తడిసె..' పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఆ పాటను ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం బాలయ్య - రకుల్పై తెరకెక్కించారు. 'ఎన్టీఆర్' బయోపిక్లో అలనాటి అందాల భామ అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ పాట చిత్రీకరణ పూర్తి చేసింది చిత్ర యూనిట్. రకుల్ పుట్టినరోజు సందర్భంగా అతిలోక సుందరి గెటప్లో రకుల్ ప్రీత్సింగ్ ఫస్ట్లుక్ని విడుదల చేశారు. అలాగే పాటలో బాలయ్య - రకుల్ వానలో తడుస్తూ స్టెప్పులేస్తున్న ఓ స్టిల్ని కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్స్లో రకుల్ అచ్చం శ్రీదేవిని తలపిస్తున్న మాట వాస్తవమే. అయితే సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు మాత్రం రకుల్ ఈ గెటప్లో బాలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు మరీ దిగజారిపోయేలా ఉండడంతో రకుల్ అభిమానులు కాస్త ఫీలవుతున్నారు.
'శ్రీదేవిలా ఉందని కొందరంటే కాదు శ్రీరెడ్డిలా ఉన్నావ్..' అని ఆమెకు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. పోజిటివ్తో పాటు ఇలా నెగిటివ్ పోస్ట్లు పెట్టేవాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ ఎవరేమనుకుంటే మాత్రం శ్రీదేవి పాత్ర పోషించడమంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశం తెలుగులో హవా తగ్గిన తరుణంలో అదీ రీ ఎంట్రీలో రకుల్ని వరించింది. సో రకుల్ లక్కీగర్లేగా.!
|