మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం 'కవచం'. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. డిశంబర్ 7న 'కవచం' ప్రేక్షకుల ముందుకు రానుంది. డేట్ అనౌన్స్ చేశాక విడుదల తేదీపై కొద్దిపాటి అనుమానాలు నెలకొన్నాయి. కానీ అదేమీ లేదనీ, అనుకున్న తేదీకే 'కవచం' ప్రేక్షకుల ముందుకు రానుందనీ క్లారిటీ ఇచ్చేసింది చిత్ర యూనిట్. శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహ్రీన్ మరో కథానాయిక. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుని పాత్ర పోషిస్తున్నాడు.
రాజు లేని రాజ్యం. ఒంటరిదైన రాణిని కవచంలా కాపాడే ఓ కుర్రాడి కథే ఈ 'కవచం'. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతవరకూ క్లాస్, మాస్ లుక్స్తో ఆకట్టుకున్న బెల్లంకొండ పోలీస్ గెటప్లో తొలిసారి నటిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ పోలీస్ గెటప్లో విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే టీజర్కీ సూపర్ గుడ్ రెస్పాన్సే వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్తో టీజర్ని కట్ చేశారు. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్కి కమర్షియల్ అంశాలు జోడించి మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ని ఒకేసారి ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో ఐదో చిత్రంగా 'కవచం' తెరకెక్కుతోంది. ఇటీవల పంచభూతాల కాన్సెప్ట్ అంటూ 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు పోలీసాఫీసర్గా 'కవచం' సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలిక.
|