తెలుగు సినీ సంగీత సాహిత్యాల పై చేసిన విశేష పరిశోధనలకు, వివిధ మాధ్యమాలలో వాటిని అందించిన విశ్లేషణలకు - మ్యూజికాలజిస్ట్ రాజా ను ఢిల్లీ తెలుగు అకాడమీ 'సమైక్య భారతి గౌరవ సత్కార్ ' అవార్డ్ తో సత్కరించింది. మోహన్ కందా వంటి మేధావులైన ఎంతోమంది ఐయ్యేయస్ ఆఫీసర్లను జ్యూరీ సభ్యులుగా కలిగిన తమ అకాడమీలో ఇటువంటి అవార్డును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని ప్రధాన కార్యదర్శి ఎన్.వి.యల్. నాగరాజు తెలిపారు. ఈ అవార్దును తమిళ నాడు గవర్నర్ కె. రోశయ్య ద్వారా రాజా స్వీకరించారు.
|