నేచురల్ స్టార్ నాని ఒక సినిమా సెట్స్పై ఉండగానే ఇంకో సినిమాని లాంఛ్ చేసేశాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జెర్సీ' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ లోగా నాని కొత్త సినిమాని ప్రారంభించేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య హీరోయిన్లుగా నటిస్తుండగా యంగ్ హీరో కార్తికేయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది. కాగా ఈ సినిమా కథా కమామిషు విషయానికి వస్తే ఈ సినిమాలో నాని క్రైమ్ నవలా రచయితగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది. కథ, కథానాలను చాలా ఆశక్తికరంగా తెరకెక్కించనున్నారట. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి, సంచలన విజయాన్ని అందుకున్న కార్తికేయ క్యారెక్టర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందట ఈ సినిమాలో. 'మనం', '24' వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్. దురదృష్టవశాత్తూ అఖిల్కి 'హలో'తో మంచి సక్సెస్ ఇవ్వలేకపోయాడు.కానీ నానితో విక్రమ్ కుమార్ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడట. అందుకే విభిన్నంగా ఈ స్క్రిప్టు ప్రిపేర్ చేశాడట. కథలో ఓ ఆశక్తికరమైన పాయింట్ ఉందట. అదేంటో సినిమాలోనే చూడాలంటున్నాడు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో పాటు, అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు విక్రమ్ కుమార్.
|