సోషల్ మీడియాలో తొలి ఇండియన్ సెలబ్రిటీ కోటీశ్వరుడు ఎవరు అన్నదానిపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖుడు అమితాబ్ బచ్చన్ అందరికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ని కలిగి వున్నారు. 70 లక్షల మంది అభిమానులు ఆయన్ను సోషల్ నెట్ వర్క్ లో ఫాలో అవుతున్నారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవం అని అమితాబ్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.
ఇంకో 30 లక్షల మంది ఫాలోవర్స్ లభిస్తే అమితాబ్ తొలి సోషల్ నెట్ వర్క్ కోటీశ్వరుడవుతారన్నమాట ఇండియాలో. సెలబ్రిటీల్లో చాలామంది సోషల్ నెట్ వర్క్ ని వినియోగిస్తున్నా, వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకపోవడం, తనకు సంబంధించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకోవడం ఇవన్నీ అమితాబ్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగేలా చేస్తోంది.
ఇంకో ఆర్నెళ్ళలో ఆ 30 లక్షల మంది ఫాలోవర్స్ అమితాబ్ ఖాతాలో చేరిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడ్తున్నప్పుడు అమితాబ్ సోషల్ నెట్ వర్క్ ని విడిచిపెట్టలేదు, బయట విన్పించే గాసిప్స్ కారణంగా కలత చెందే అభిమానులకు సోషల్ నెట్ వర్క్ ద్వారా అభిమానులకు సమాచారం అందించేవారాయన. అందుకే ఆయన బిగ్ `బి అనిపించుకున్నారు.
|