కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'చిత్రలహరి'. టీజర్తో ఆకట్టుకున్న తేజూ తాజాగా 'గ్లాస్మేట్స్.. ' సాంగ్తోనూ ఇరగదీసేశాడు. ఈ సాంగ్ యూత్తో పాటు, మందు బాబుల్ని కూడా బాగా ఎట్రాక్ట్ చేసింది. నిజాలను పాట రూపంలో వినిపించి తేజు స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగించాడు. రకరకాల రిలేషన్షిప్స్ని ఎనాలసిస్ చేస్తూ రచించిన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇవన్నీ వెరసి, సినిమాపైనా అంచనాలు బాగానే నెలకొన్నాయి.. కానీ, తేజు వైపు నుండే అనుమానాలున్నాయి. ప్రస్తుతం తేజు కెరీర్ ఏమంత బాగా లేదు. ఏది టచ్ చేసినా కలిసి రావడం లేదు. కానీ ఈ సినిమా రూపంలో తేజుకి లక్ కలిసొచ్చేలానే ఉందని అనుకుంటున్నారు.
మైత్రీ మూవీస్ బ్యానర్ నుండి ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ తెలుస్తోంది. ప్రమోషన్స్ని గ్రాండ్గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగా ఫ్యామిలీ హీరోస్తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ని గెస్ట్గా పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనీ సమాచారమ్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కళ్యాణీ ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేవలం గ్లామర్ కోసమో, లేక పాటల కోసమో కాకుండా హీరోయిన్లు ఇద్దరి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉండబోతోందట ఈ సినిమాలో. చూడాలి మరి వీరిద్దరిలో ఎవరి లక్కు కలిసొచ్చినా తేజుకి పంట పండినట్లే.
|