మహేష్బాబు - పూజా హెగ్దే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహర్షి' విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మే 9 గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు 'మహర్షి'ని. కాగా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల 'మహర్షి' ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. 'చోటీ చోటీ బాతే.. మీటీ మీటీ యాదే..' అంటూ సాగే ఈ సాంగ్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్, పూజా హెగ్దేతో పాటు, ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ముగ్గురి మధ్యా సాగే స్నేహాన్ని ఈ పాటలో హార్ట్ టచ్చింగ్గా చూపించారు. చిన్నతనం నుండీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న ఈ ముగ్గురూ పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆ స్నేహాన్ని కొనసాగించిన తీరును చూపించారు. పోస్టర్స్ డిజైన్ చేసిన విధానం సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇంతవరకూ ఉన్న ఓ మోస్తరు అంచనాలు కాస్తా అమాంతం పెరిగిపోయాయి ఈ ఆడియో సింగిల్తో పాటు విడుదలైన పోస్టర్స్తో. ఇదిలా ఉంటే, 'మహర్షి' కథ ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ హాఫ్లో అల్లరి నరేష్ క్యారెక్టర్ని చంపేస్తారట.
ఆ తర్వాత మహేష్బాబు తన స్నేహితుడి కోసం విదేశాల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్ని వదిలి పెట్టి పల్లెటూరికొచ్చేస్తాడట. అదీ 'మహర్షి' స్టోరీ అట.. అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అంటే అల్లరి నరేష్ పాత్ర కొంతవరకే పరిమితమా.? అని అభిమానులు కాస్త నిరాశపడుతున్నారు. లేదు లేదు అల్లరి నరేష్ పాత్ర చివరి వరకూ ఉంటుందట అంటూ మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అసలు కథనం తెలియాలంటే మే 9 వరకూ ఆగాల్సిందే.
|