అల్లు శిరీష్ తాజా చిత్రం 'ఎబీసీడీ - అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశీ'. దప దపాలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. మే 17న 'ఏబీసీడీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో అల్లు శిరీష్కి జోడీగా రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నానికి జోడీగా నటించిన ముద్దుగుమ్మే ఈ రుక్సార్. కాగా ఈ సినిమాలో బాల నటుడిగా పాపులర్ అయిన మాస్టర్ భరత్ టీనేజ్ బోయ్గా అవతారమెత్తాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. ఇదిలా ఉంటే, లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఎంటర్టైనింగ్ అంశాలతో ట్రైలర్ని నింపేశారు. అమెరికాలో రిచ్ ఫ్యామిలీలో పుట్టి, ఏ కష్టం తెలీయకుండా పెరిగిన ఓ కుర్రోడు బలవంతంగా ఇండియాకొచ్చి ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేశాడు.. అనేదే 'ఏబీసీడీ' కథ. కాగా ఈ సినిమాలో అల్లు శిరీష్ హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటున్నాడు.
యాక్టింగ్లోనూ ఈజ్ కనిపిస్తోంది. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయ్. హిట్ కళ కనిపిస్తోంది 'ఏబీసీడీ'కి. అసలే 'ఒక్క క్షణం' సినిమాతో హిట్ కొట్టి ఉన్నాడు అల్లు శిరీష్. ఆ సినిమా తర్వాత శిరీష్ నుండి వస్తున్న సినిమా ఇది. ట్రైలర్ రాక ముందు సినిమా పరిస్థితి వేరు. ట్రైలర్ వచ్చాక అంచనాలు వేరు. టోటల్గా హాట్ సమ్మర్లో శిరీష్ కూల్గా ఎంటర్టైన్ చేసేలానే ఉన్నాడు 'ఏబీసీడీ'తో అల్లు శిరీష్. సంజీవ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి.
|