ప్రభుదేవా - తమన్నా జంటగా నటించిన 'అభినేత్రి' సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రాబోతోంది. 'అభినేత్రి'లో మిల్కీబ్యూటీ తమన్నా మాత్రమే దెయ్యం పాత్ర పోషించింది. కానీ 'అభినేత్రి 2'లో ప్రభుదేవా కూడా దెయ్యంగా కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ విడుదలైన టీజర్లో ప్రభుదేవాపై కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ చూపించారు. డబుల్ వేరియేషన్స్లో ప్రభుదేవా నటన ఆకట్టుకునేలా ఉంటుందని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారమ్. అలాగే మరో క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ సీక్వెల్కి సంబంధించి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', ప్రేమకథాచిత్రమ్ 2' సినిమాలతో దెయ్యం పాత్రలతో ఆకట్టుకున్న నందితా శ్వేత ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. అయితే ఈ దెయ్యం పిల్ల ఈ సినిమాలోనూ దెయ్యంగానే కనిపించనుందా.? లేదా.? అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.
ఈ సినిమాలో సీనియర్ నటి కోవై సరళ మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే 'అభినేత్రి 2'కి చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1కి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇదే రోజు యంగ్ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా కూడా రిలీజ్ కానుంది. జర్నలిస్ట్ పాత్రలో నిఖిల్ కనిపించనున్నాడు ఈ సినిమాలో. చూడాలి మరి ప్రభుదేవా దెయ్యాలా.? లేక అర్జున్ సురవరం జర్నలిజమా.? బాక్సాఫీస్ ఫైట్లో గెలుపెవరిదో.!
|