ఎలక్షన్స్ ముగిశాయి. ఫలితాలు వచ్చేందుకు ఇంకా చాలా టైముంది. ఈ లోగా పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎప్పటినుండో రెడీగా ఉంది. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారనే ప్రచారం ఉంది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం, సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరగడంతో మైత్రీ వారితో సినిమాని హోల్డ్లో పెట్టేశాడు పవన్ కళ్యాణ్. మైత్రీ వారితో పాటు, మరికొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. అయితే ఇప్పుడిక సినిమాల పైనా దృష్టి పెట్టాలనీ, కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటున్నాడట. అది కూడా మైత్రీ వారి బ్యానర్లోనే చేయాలని అనుకుంటున్నాడట.
ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన 'చిత్రలహరి' సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమా చూసి పవన్ కళ్యాణ్ టీమ్ వర్క్ని అప్రిషియేట్ చేస్తూ, నిర్మాణ సంస్థ అయిన మైత్రీ వారికి ఫ్లవర్ బొకేస్ని గిఫ్ట్గా పంపించారు. ఇదంతా చూస్తుంటే మైత్రీ వారిలో పవన్ సినిమా కన్ఫామ్ అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకి డాలీ (కిషోర్ కుమార్ పార్ధసారధి) డైరెక్షన్ వహించనున్నారనీ సమాచారమ్. డాలీతో పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' చిత్రాల్లో నటించారు. 'కాటమరాయుడు' తర్వాత పవన్ సినిమాల్లో నటించలేదు. అంటే పవన్ ఎక్కడ ఆపారో అక్కడి నుండే మళ్లీ సినిమా మొదలు పెట్టబోతున్నారనుకోవాలి. ఈ ప్రాజెక్ట్కి స్క్రిప్టు కూడా రెడీ అయిందట. ఇక త్వరలోనే ఫైనల్ చేసి, అధికారికంగా అనౌన్స్ చేయనున్నారనీ తెలుస్తోంది.
|