ఒకే ఒక్క సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించాడు. అంతవరకూ చిన్న చూపున్న కన్నడ సినీ పరిశ్రమ అంటే ఇదీ.. అని కన్నడ సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు. 'బాహుబలి' సినిమాలతో రాజమౌళి గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నారో ఆ తర్వాత ఆయన గురించే అంతలా చర్చించుకున్నారు. ఈ పాటికే ఆయన ఎవరో అర్ధమైపోయుంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన తెరకెక్కించిన కన్నడ మూవీ 'కేజీఎఫ్' కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. వసూళ్ల సునామీ సృష్టించింది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి అగ్ర హీరోలు, దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అగ్ర దర్శక, నిర్మాతలు క్యూ కట్టేశారు ప్రశాంత్ నీల్ కోసం.
ఈ క్రమంలో టాలీవుడ్ నుండి ఓ స్టార్ హీరో ప్రశాంత్ నీల్తో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ హీరో మొదట్లో ప్రబాస్ అనుకున్నారు. కానీ అది ఎన్టీఆర్ అనీ తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్తో పాటు, చరణ్ కూడా నటించే అవకాశాలున్నాయట. ఈ ప్రాజెక్ట్ని మైత్రీ మూవీస్ వారు నిర్మించే అవకాశం ఉందనీ తెలుస్తోంది. అవకాశమేంటీ.. ఇటీవల ప్రశాంత్ నీల్ బర్త్డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ తరపున ఘనంగా స్పెషల్ విషెస్ అందాయి ప్రశాంత్నీల్కి. కాంబినేషన్ సెట్ అయితేనే ఇలాంటి స్పెషల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కాంబో సెట్ అయిందనడానికి ఇదో సూచనగా భావించొచ్చు. మరోవైపు 'కేజీఎఫ్' హీరో యష్తోనే ప్రశాంత్ ఓ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడనే సమాచారమ్ ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందట. చూడాలి మరి ఈ క్రేజీ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్లో నటించబోయే ఆ క్రేజీ హీరో ఎవరో.?
|