కావలసిన పదార్థాలు
మటన్ ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు.
తయారుచేయు విదానం
ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయుంచుకోవాలి. వేగిన తరువాత అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఖీమా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మంట తగ్గించుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. బాగా మగ్గిన తరువాత అందులో సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి 3-4 విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. బాగా ఉడికాక కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. దగ్గర పడేవరకు స్టవ్ పై వుంచాలి.
|