వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఎవరు'. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ నుండి సినిమా వస్తుందంటే, సినీ ప్రియుల్లో ఓ మోస్తరు అంచనాలుంటాయి. మన అడవి శేష్ కూడా అలాంటిలాంటి సినిమాలు చేయడు. తన సినిమా అంటే కథలో సమ్థింగ్ డిఫరెంట్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాడు. తాజా చిత్రం 'ఎవరు'లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్నే టచ్ చేసినట్లు ప్రచార చిత్రాల ద్వారా హింట్ ఇచ్చాడు అడవి శేష్. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అనలేం కానీ, లంచాలు తీసుకునే పోలీసాఫీసర్గా అడవి శేష్ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. రెజీనాకి గ్లామర్ కన్నా, పర్ఫామెన్స్కి స్కోప్ ఎక్కువ ఉన్న పాత్ర దక్కినట్టు కనిపిస్తోంది.
కథ మొత్తం రెజీనా చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. రెజీనాపై రేప్ సీన్ని ట్రైలర్లో కట్ చేశారు. అంతేకాదు, రెజీనా ఈ సినిమాలో చాలా పర్ఫామెన్స్తో పాటు, హద్దులు దాటిన గ్లామర్తో కనిపింస్తుందనీ సమాచారం. ఇక థ్రిల్లింగ్ అంశాల విషయానికొస్తే, ఇలాంటి సీన్స్ ఇంతకు ముందెన్నడూ చూసి ఉండమట. ఉత్కంఠతో ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోతారట. ఇదిలా ఉంటే, ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'ఇన్విజిబుల్ గెస్ట్'కి రీమేక్ అని ఓ వైపు, ఈ సినిమా కథ అచ్చం బాలీవుడ్ మూవీ 'బద్లా'ని పోలి ఉందని ఇంకో వైపు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అడవి శేష్ 'ఎవరు' ఎలాంటి మూవీ.? ఎలా ఉండబోతోంది.? ఎలాంటి టాక్ తెచ్చుకోబోతోంది.? అని తెలియాలంటే, ఆగస్ట్ 15 వరకూ వేచి చూడాల్సిందే. అదే రోజు 'ఎవరు' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|